Dayananda saraswati born
Swami dayanand saraswati was born in...
పరిపూర్ణానంద స్వామి
పరిపూర్ణానంద ఆధ్యాత్మిక గురువు. అతను శ్రీపీఠం వ్యవస్థాపకుడు.[1]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]ఆయన నెల్లూరులో 1972 నవంబరు 1 న జన్మించాడు.[2] 14 సంవత్సరాల వయస్సులోనే, తల్లి కోరిక మేరకు వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తూ సంతృప్తి చెందక, 16వ ఏట ఋషీకేశ్ చేరుకున్నాడు.
Dayananda saraswati teachings
అచ్చట దయానంద సరస్వతి స్వామి వద్ద భారతీయ వాఙ్మయాలను, ఉపనిషత్ సిద్దాంతాలను, భాష్యాలను అధ్యయనం చేశాడు. వీటితో పాటు ఆగమ, మంత్ర, వాస్తు, జ్యోతిష్యములను కూడా వేరు వేరు గురువుల వద్ద అధ్యయనము చేసారు.[3]
శ్రీపీఠం ప్రతిష్టాపన
[మార్చు]తన గురువు దయానంద స్వామి ఆజ్ఞ అనుసారం ఆంధ్ర రాష్ట్రం తన ప్రవచనముల ద్వారా వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ 1999 సం.లో, తూర్పు గోదావరి జిల్లాకాకినాడ పట్టణంలో శ్రీపీఠంలో ఐశ్వర్యంబికా సమేత సుందరేశ్వర స్వామివారుల ప్రతిష్ఠను గావించారు.
కొన్ని సంవత్సరముల పాటు శ్రీపీఠం అభివృద్ధిలో నిమగ్నమై అచ్చటనే ఉంటూ ప్రవచనములను, శిక్షణ శిబిరాలను, సేవలను నిర్వహించాడు. ఆంధ్ర ప్రదేశ్ కరువు కాటకాలతో వర్షాలు లేక బాధపడుతున్న సమయంలో 2002 లో శ్రీపీఠంలో 32 రోజులపాటు మహానక్షత్రయాగాన్